IMG-20260317-WA0011

బీర్కూర్ లో కళాకారుల ఆటపాటలతో ప్రజా పాలన ప్రచారం

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రజా పాలనలోని 6 గ్యారంటీల గురించి పాటలు, ప్రదర్శనల ద్వారా వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి […]

Continue Reading
IMG-20260316-WA0039

ఎల్లారెడ్డి చెరువులో యువకుడి మృతదేహం.. గ్రామంలో విషాదం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు నివాసి చిట్యాల దుర్గేందర్ మృతదేహం సోమవారం ఉదయం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్యమైంది. శనివారం నుంచి అదృశ్యమైన దుర్గేందర్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి అన్న పరందాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు ఆదివారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా సోమవారం ఉదయం పెద్ద చెరువులో మృతదేహం కనిపించినట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి […]

Continue Reading
IMG-20260316-WA0021

బెల్టు షాపులు ఎత్తివేయాలని వెల్లుట్ల గ్రామస్తుల వినతి

మద్యం విక్రయాలతో యువత పెడదారి: గ్రామంలో అశాంతి ​ఎల్లారెడ్డి (Yellareddy), మార్చి 16: గ్రామాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని, బెల్టు షాపులను (Belt Shops) తక్షణమే మూసివేయాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామస్థులు సోమవారం ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ షకీర్ అహ్మద్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ​నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు ఈ సందర్భంగా వెల్లుట్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల నిర్వాహకులు నిబంధనలకు […]

Continue Reading
IMG_20260316_132713

Madan Mohan Rao Yellareddy: ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గానికి రూ. 18.10 కోట్ల నిధులు!

ఎల్లారెడ్డి, మార్చి 16: ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తాజాగా రూ. 14.50 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషితో గత వారం రోజుల్లోనే మొత్తం రూ. 18.10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​మండలాల […]

Continue Reading

వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు

జుక్కల్/కామారెడ్డి, మార్చి 16: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారు, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన […]

Continue Reading
IMG-20260315-WA0014

ఎల్లారెడ్డి : లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం..

హైదరాబాద్ నుంచి వచ్చి అదృశ్యం… రాపిడో డ్రైవర్ కోసం కుటుంబం ఆందోళన ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన ఎల్లారెడ్డి మండలంలో కలకలం రేపింది. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్ (30) శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. అక్కడి నుంచి తన బావమరిది ప్రసాద్‌తో కలిసి నిజాంసాగర్ బస్సులో ఎల్లారెడ్డికి బయలుదేరాడు. లింగంపేట వద్ద ప్రసాద్ బస్సు దిగగా, దుర్గేందర్ మాత్రం ఎల్లారెడ్డికి వస్తున్నానని కుటుంబ […]

Continue Reading
652665866_907526968776364_1156758207166741522_n

మార్కల్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. పైడి ఎల్లారెడ్డి

సదాశివనగర్, మార్చి 15: ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన గుండారపు విజయ – కీర్తిశేషులు నర్సారెడ్డి దంపతుల కుమారుని వివాహం గత గురువారం (మార్చి 12న) జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారి నివాసానికి వెళ్లిన పైడి ఎల్లారెడ్డి, నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి కుమారుడు, కోడలిని ఆశీర్వదించి వారికి అక్షింతలు వేసి శుభం కలగాలని […]

Continue Reading

యెల్లారెడ్డి కౌన్సిలర్ సిద్ది శ్రీధర్‌కు ఘన సన్మానం

హైదరాబాద్ (ముషీరాబాద్): అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (IVF) మరియు తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సిద్ది శ్రీధర్‌ను ఘనంగా సన్మానించారు. ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. యెల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న సిద్ది శ్రీధర్‌ సమాజ సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. ఏపీ ఆర్యవైశ్య ప్రతినిధి టీ.జీ. […]

Continue Reading

మనసును ప్రశాంత పరిచే ‘రామనామం’: కలియుగంలో తారక మంత్రం ప్రాముఖ్యత ఇదే!

ఆధ్యాత్మిక డెస్క్: “రామ” అనే రెండు అక్షరాల నామంలోనే అనంతమైన శక్తి దాగి ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, కలియుగంలో మానవుడు ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి, అశాంతికి రామనామం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. రామనామ జపం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది మనసును నిర్మలం చేసే ఒక సాధన. రామ నామ విశిష్టత రామనామాన్ని ‘తారక మంత్రం’ అని పిలుస్తారు. తారక అంటే ‘తరింపజేసేది’ అని అర్థం. అంటే సంసార సాగరం నుంచి, […]

Continue Reading
WhatsApp-Image-2026-03-13-at-19.19.33

లింగారెడ్డి పేట్‌లో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్

లింగారెడ్డిపేట్‌లో లో-లెవల్ ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, మార్చి 15: ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా రక్షణకు పెద్దపీట వేస్తామని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో ప్రాణసంకటంగా మారిన విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లనాటి భయం.. గంటల్లో పరిష్కారం లింగారెడ్డిపేట్‌లోని జనసంచారం అధికంగా ఉండే వీధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అత్యంత తక్కువ […]

Continue Reading