IMG-20260414-WA0026

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

కామారెడ్డి యెల్లారెడ్డి నియోజకవర్గం
    • ఎల్లారెడ్డిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

    • అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు నిబంధనలపై ప్రతిజ్ఞ

    • మున్సిపల్ చైర్మన్, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన

    ఎల్లారెడ్డి, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.

    నిబంధనలు పాటిస్తేనే భద్రత ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.

    ఘనంగా ప్రతిజ్ఞా కార్యక్రమం అనంతరం సుమారు 100 మంది ఆటో, లారీ డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలతో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

    “ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు.” — డి. రాజారెడ్డి, సీఐ

    ఈ కార్యక్రమంలో ఎస్సై బి. మహేష్, ఎస్సై-2 బాలసుబ్రహ్మణ్య చారి, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *