కామారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకట రమణ రెడ్డి దేశ రాజధాని New Delhiలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి Bhupathiraju Srinivasa Varmaను కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత శాఖలు, Ministry of Micro, Small and Medium Enterprises (ఎంఎస్ఎంఈ)తో సమగ్ర పరిశీలన చేపట్టాలని మంత్రి సూచించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.