బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద MPDO కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఎమెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబ ఆడబిడ్డల పెళ్లి భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. అర్హులైనవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో షెట్లూర్ సర్పంచ్ కాళోజి విట్టాల్, స్థానిక ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.