ఎల్లారెడ్డి, మార్చి 16: ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తాజాగా రూ. 14.50 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషితో గత వారం రోజుల్లోనే మొత్తం రూ. 18.10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు:
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ నిధులను కింది విధంగా విభజించారు:
మండలం గ్రామాల సంఖ్య మంజూరైన నిధులు (కోట్లలో)
గాంధారి 45 రూ. 4.50 కోట్లు
లింగంపేట 33 రూ. 2.35 కోట్లు
ఎల్లారెడ్డి 28 రూ. 2.45 కోట్లు
నాగిరెడ్డిపేట్ 20 రూ. 2.00 కోట్లు
సదాశివనగర్ 19 రూ. 1.35 కోట్లు
రామారెడ్డి 09 రూ. 0.55 కోట్లు
రాజంపేట 08 రూ. 0.60 కోట్లు
అభివృద్ధి దిశగా ముందడుగు
గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. మారుమూల గ్రామాల్లో సైతం నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి. కేవలం వారం రోజుల్లోనే రూ. 18.10 కోట్లు తీసుకురావడం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి పట్టుదలకు, అభివృద్ధి సంకల్పానికి నిదర్శనమని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతల వెల్లువ
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గ ముఖచిత్రం మారనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.