గుర్రంపోడ్, మార్చి 16: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే ముఖ్యమని భావిస్తున్న అధికార పార్టీ నాయకుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
తీనేపల్లిలో ‘మహిళా శక్తి’కి బ్రేక్! గుర్రంపోడ్ మండలం తీనేపల్లి గ్రామంలో మహిళల కోసం మంజూరైన ‘మహిళా శక్తి’ భవన నిర్మాణాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీలో గ్రామ కంఠం భూమిని తీర్మానం చేసుకున్న తర్వాత కూడా, కావాలనే పనులు చేపట్టనివ్వకుండా రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. “మహిళల భవనం కోసం స్థలం ఇస్తే అడ్డుపడతారా? మీ రాజకీయాలు ప్రజల అభివృద్ధి కంటే ముఖ్యమా?” అని ఆయన ప్రశ్నించారు.
చామలోని బావిలో అధికారుల నిర్లక్ష్యం.. అదేవిధంగా చామలోని బావి గ్రామంలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనం, మహిళా శక్తి భవనం మరియు సీసీ రోడ్ల పనులకు సంబంధించి అధికారులు ఎస్టిమేషన్లు (అంచనాలు) ఇవ్వకుండా తాత్సారం చేయడంపై మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. సర్పంచ్లను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడిఓ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎఈతో సంప్రదింపులు – సమస్య పరిష్కారానికి అల్టిమేటం గ్రామస్థులు మరియు సర్పంచ్ల విన్నపం మేరకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే, వెంటనే పంచాయతీ రాజ్ శాఖ ఏఈతో ఫోన్లో మాట్లాడారు. “సర్పంచ్లను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. ఎస్టిమేషన్లు వెంటనే పూర్తి చేసి అభివృద్ధికి సహకరించాలి. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు. అభివృద్ధిలో రాజకీయాలు జొప్పించవద్దని, గ్రామాల ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. విడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి.