ఎల్లారెడ్డిలో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు

కామారెడ్డి యెల్లారెడ్డి నియోజకవర్గం

ఎల్లారెడ్డి: మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. శనివారం జరిగిన  పదవ తరగతి తొలి పరీక్ష (తెలుగు – మొదటి పేపర్)ను విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పారు.

పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *