IMG_20260316_132713

Madan Mohan Rao Yellareddy: ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గానికి రూ. 18.10 కోట్ల నిధులు!

ఎల్లారెడ్డి, మార్చి 16: ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తాజాగా రూ. 14.50 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషితో గత వారం రోజుల్లోనే మొత్తం రూ. 18.10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​మండలాల […]

Continue Reading
IMG-20260315-WA0014

ఎల్లారెడ్డి : లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం..

హైదరాబాద్ నుంచి వచ్చి అదృశ్యం… రాపిడో డ్రైవర్ కోసం కుటుంబం ఆందోళన ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన ఎల్లారెడ్డి మండలంలో కలకలం రేపింది. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్ (30) శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. అక్కడి నుంచి తన బావమరిది ప్రసాద్‌తో కలిసి నిజాంసాగర్ బస్సులో ఎల్లారెడ్డికి బయలుదేరాడు. లింగంపేట వద్ద ప్రసాద్ బస్సు దిగగా, దుర్గేందర్ మాత్రం ఎల్లారెడ్డికి వస్తున్నానని కుటుంబ […]

Continue Reading
652665866_907526968776364_1156758207166741522_n

మార్కల్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. పైడి ఎల్లారెడ్డి

సదాశివనగర్, మార్చి 15: ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన గుండారపు విజయ – కీర్తిశేషులు నర్సారెడ్డి దంపతుల కుమారుని వివాహం గత గురువారం (మార్చి 12న) జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారి నివాసానికి వెళ్లిన పైడి ఎల్లారెడ్డి, నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి కుమారుడు, కోడలిని ఆశీర్వదించి వారికి అక్షింతలు వేసి శుభం కలగాలని […]

Continue Reading

యెల్లారెడ్డి కౌన్సిలర్ సిద్ది శ్రీధర్‌కు ఘన సన్మానం

హైదరాబాద్ (ముషీరాబాద్): అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (IVF) మరియు తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సిద్ది శ్రీధర్‌ను ఘనంగా సన్మానించారు. ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. యెల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న సిద్ది శ్రీధర్‌ సమాజ సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. ఏపీ ఆర్యవైశ్య ప్రతినిధి టీ.జీ. […]

Continue Reading

మనసును ప్రశాంత పరిచే ‘రామనామం’: కలియుగంలో తారక మంత్రం ప్రాముఖ్యత ఇదే!

ఆధ్యాత్మిక డెస్క్: “రామ” అనే రెండు అక్షరాల నామంలోనే అనంతమైన శక్తి దాగి ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, కలియుగంలో మానవుడు ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి, అశాంతికి రామనామం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. రామనామ జపం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది మనసును నిర్మలం చేసే ఒక సాధన. రామ నామ విశిష్టత రామనామాన్ని ‘తారక మంత్రం’ అని పిలుస్తారు. తారక అంటే ‘తరింపజేసేది’ అని అర్థం. అంటే సంసార సాగరం నుంచి, […]

Continue Reading
WhatsApp-Image-2026-03-13-at-19.19.33

లింగారెడ్డి పేట్‌లో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్

లింగారెడ్డిపేట్‌లో లో-లెవల్ ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, మార్చి 15: ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా రక్షణకు పెద్దపీట వేస్తామని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో ప్రాణసంకటంగా మారిన విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లనాటి భయం.. గంటల్లో పరిష్కారం లింగారెడ్డిపేట్‌లోని జనసంచారం అధికంగా ఉండే వీధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అత్యంత తక్కువ […]

Continue Reading
IMG-20260315-WA0008

ఎల్లారెడ్డిలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. సర్పంచ్ పల్లె నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామంలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
IMG_20260314_140012-1

ఎల్లారెడ్డిలో పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ఎల్లారెడ్డి మండలంలో పకడ్బందీగా ఏర్పాట్లు: ఎంఈఓ రాజులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎస్ఐ మహేష్ ఎల్లారెడ్డి: మండల వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన తెలుగు మొదటి పేపర్ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) రాజులు వెల్లడించారు. అధికారుల […]

Continue Reading

ఎల్లారెడ్డిలో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు

ఎల్లారెడ్డి: మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. శనివారం జరిగిన  పదవ తరగతి తొలి పరీక్ష (తెలుగు – మొదటి పేపర్)ను విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading